బీజేపీ విధానాలతో రాష్ర్టానికి నష్టం

ABN , First Publish Date - 2022-01-24T06:33:19+05:30 IST

బీజేపీ విధానాలతో రాష్ర్టానికి నష్టం

బీజేపీ విధానాలతో రాష్ర్టానికి నష్టం
సమావేశంలో మాట్లాడుతున్న నరసింహారావు

 గన్నవరం, జనవరి 23 : బీజేపీ విధానాలతో రాష్ర్టానికి తీవ్రనష్టం కలుగుతుందని, వీరికి వ్యతిరేకంగా వైసీపీ, టీడీపీ పోరాటం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు అన్నారు. స్థానిక సీపీఎం కార్యాల యంలో విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ మోసం చేస్తుందన్నారు. మరోవైపు జనసేనాను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం లేదన్నారు. ఈ రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీతో దోస్తీగాను, రాష్ట్రంలో కొట్టుకుంటూ నాటకాలు ఆడుతు న్నట్లు విమర్శించారు. రాష్ట్రంలో జగన్‌ విధానాలకు వ్యతి రేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటాల్లోకి వచ్చారని చెప్పారు. ఓటీఎస్‌ విధానంతో పేదలు తిరుగుబాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులు కూడా ఉద్యమాల్లోకి వస్తున్నారని ఈ దశలో కమ్యూనిస్టుల అవసరం పెరుగు తుందన్నారు. ప్రజలను పోరాటాల్లోకి తీసుకొచ్చేందుకు సీపీఎం శ్రేణులు కృషి చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్లం వెంకటేశ్వరరావు, మాజీ వైస్‌ ఎంపీపీ అనుమోలు వెంకటేశ్వరరావు, మురాల రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:33:19+05:30 IST