బోణీ కొట్టిన బీజేపీ.. రెండు స్థానాల్లో గెలుపు
ABN , First Publish Date - 2020-12-04T20:24:36+05:30 IST
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సత్తా
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సత్తా చూపిన బీజేపీ.. ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. కొన్ని స్థానాల్లో అధికార టీఆర్ఎస్కు బీజేపీ గట్టిగా పోటీ ఇచ్చింది. ఇంకా అదే కొనసాగుతోంది కూడా. తాజాగా బీజేపీ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. చైతన్యపురిలో బీజేపీ అభ్యర్థి రంగా నర్సింహ గుప్తా గెలుపొందారు. అధికార పార్టీ అభ్యర్థిపై 5 వేల మెజార్టీతో గుప్తా ఘన విజయం సాధించారు. చంపాపేటలోనూ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.
దూసుకెళ్తున్న స్థానాలు..
హబ్సిగూడ డివిజన్లో 500 ఓట్ల ఆధిక్యత
రామంతాపూర్లో 1000 ఓట్ల ఆధిక్యత
లింగోజిగూడలో 1692 ఓట్ల ఆధిక్యత
బేగంబజార్లో 3600 ఓట్ల ఆధిక్యత (శంకర్ యాదవ్)
మల్కాజ్గిరిలో 1300 ఓట్ల ఆధిక్యత
మూసాపేట్లో 463 ఓట్ల ఆధిక్యత
ముసారాంబాగ్లో 2,200 ఓట్ల మెజార్టీతో ముందంజ
మోండా మార్కెట్ డివిజన్లో 3 వేల ఓట్ల మెజార్టీతో ముందంజ
సైదాబాద్లో 200 ఓట్ల ఆధిక్యం
బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండే డివిజన్లు..
తార్నాక
సీతాఫల్మండీ
కాచిగూడ
నల్లకుంట
బేగంబజార్
మంగల్హాట్
గన్ఫౌండ్రీ
గోషామహల్