బీజేపీ ఆధ్వర్యంలో నిరసన

ABN , First Publish Date - 2022-01-17T06:25:43+05:30 IST

మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచాలని బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బస్టాండ్‌ ఆవరణలో నిరసన తెలిపారు.

బీజేపీ ఆధ్వర్యంలో నిరసన
ఇల్లంతకుంటలో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

ఇల్లంతకుంట, జనవరి 16: మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచాలని బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బస్టాండ్‌ ఆవరణలో నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి స్థాయిని పెంచుతామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చి 44 నెలలు గడుస్తున్నా హామీ నెరవేరలేదన్నారు. ఇటీవల ప్రభుత్వం ఆసుపత్రుల స్థాయి పెంపు జీవోలో ఇల్లంతకుంటను విస్మరించిందన్నారు. బీజేపీ పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని,  ఉద్యమిస్తున్న వారిపై పోలీసుకేసులు పెడుతోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదన్నారు. అనంతరం ఎస్సై రఫీక్‌ఖాన్‌ బీజేపీ నాయకులకు నచ్చజెప్పి విరమింపజేశారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధానకార్యదర్శి నాగసముద్రాల సంతోష్‌, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజు, నాయకులు వజ్జపెల్లి శ్రీకాంత్‌, మామిడి హరీష్‌, ఒగ్గరి ముత్యం, చల్లూరి భాను, అంతటి వేణు, దురుముట్ల ప్రశాంత్‌, శ్రీకాంత్‌, సన్ని, సాయి, చుక్క రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T06:25:43+05:30 IST