ఒక్క ఓటు తేడాతో BJP మేయర్ అభ్యర్ధి గెలుపు, ఆప్ నిరసన

ABN , First Publish Date - 2022-01-08T21:23:45+05:30 IST

ఛండీగఢ్ మేయర్‌గా బీజేపీకి చెందిన సర్బజిత్ కౌర్ థిల్లాన్ శనివారంనాడు..

ఒక్క ఓటు తేడాతో BJP మేయర్ అభ్యర్ధి గెలుపు, ఆప్ నిరసన

న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్‌గా బీజేపీకి చెందిన సర్బజిత్ కౌర్ థిల్లాన్ శనివారంనాడు ఎన్నికయ్యారు. కేవలం ఒక్క ఓటు తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అంజు కత్యాల్‌పై ఆమె గెలుపొందారు. 28 ఓట్లలో థిల్లాన్‌కు 14 ఓట్లు రాగా, కత్యాల్‌కు 13 ఓట్లు పోలయ్యాయి. ఒక ఓటు చెల్లలేదు. దీంతో చండీగఢ్ మేయర్‌గా సర్బజిత్ కౌర్ థిల్లాన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆప్ కౌన్సిలర్లు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అసెంబ్లీ హాలులోనే నిరసన తెలిపారు. ఇద్దరు అభ్యర్థులకు చెరో 14 ఓట్లు వచ్చినట్టు తొలి వార్తలు వచ్చాయి. కాగా, ఒక ఓటు చెల్లకపోవడంతో సర్బజిత్ కౌర్ ఎన్నికను అధికారులు ప్రకటించారు. సర్బజిత్ కౌర్ ఒకటవ వార్డు కౌన్సిలర్‌‍గా ఉండగా, ఆమె భర్త జగ్తర్ సింగ్ థిల్లాన్ మాజీ కౌన్సిలర్.

Updated Date - 2022-01-08T21:23:45+05:30 IST