214కు చేరిన బ్లాక్ ఫంగస్ కేసులు
ABN , First Publish Date - 2021-06-17T07:17:50+05:30 IST
తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య బుధవారం 214కు చేరింది.
తిరుపతి సిటీ, జూన్ 16: తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య బుధవారం 214కు చేరింది. స్విమ్స్ శ్రీపద్మావతి కొవిడ్ కేంద్రంలో బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 136 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే రుయాలో మరో 78 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చాపకింద నీరులా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.