యాప్‌ ద్వారా యువతితో పరిచయం.. ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌

ABN , First Publish Date - 2021-04-08T11:58:29+05:30 IST

నగర యువతితో సన్నిహితంగా మెలిగి ఆ ఫొటోలతో

యాప్‌ ద్వారా యువతితో పరిచయం.. ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : నగర యువతితో సన్నిహితంగా మెలిగి ఆ ఫొటోలతో బ్లాక్‌మెయి ల్‌ చేస్తున్న వ్యక్తిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక బీదర్‌ జిల్లా ఔరాద్‌ ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌(32) బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం నగరానికి చెందిన యువతితో సోషల్‌మీడియా యాప్‌ ద్వారా పరిచయం చేసుకొని స్నేహం చేశాడు. ఆ తర్వాత నగరానికి వచ్చిన నిందితుడు ఆమెతో సన్నిహితంగా ఉంటూ తీసుకున్న ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించాడు. సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను యువతి ఆశ్రయించగా.. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-04-08T11:58:29+05:30 IST