ఇరాన్ మెడికల్ క్లినిక్లో పేలుళ్లు...19 మంది మృతి
ABN , First Publish Date - 2020-07-01T11:09:02+05:30 IST
ఇరాన్ దేశ రాజధాని నగరమైన టెహరాన్లోని ఓ మెడికల్ క్లినిక్లో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది.....
టెహరాన్ (ఇరాన్) : ఇరాన్ దేశ రాజధాని నగరమైన టెహరాన్లోని ఓ మెడికల్ క్లినిక్లో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో మెడికల్ క్లినిక్లో 19 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని టెహరాన్ డిప్యూటీ గవర్నర్ హమీద్ రెజా చెప్పారు.మెడికల్ క్లినిక్లో గ్యాస్ లీకవడం వల్ల భారీ పేలుడు సంభవించిందని గవర్నర్ హమీద్ రెజా పేర్కొన్నారు. పేలుడు ఘటన జరగగానే అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి నిచ్చెనలతో భవనంపైకి ఎక్కి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మెడికల్ క్లినిక్లో పేలుడు జరిగినపుడు 25 మంది ఉద్యోగులున్నారని, చిన్న శస్త్రచికిత్సలు సాగుతున్నాయని ఆసుపత్రి అధికారులు చెప్పారు.