గుజరాత్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 40 మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-06-03T21:57:02+05:30 IST

గుజరాత్‌లోని దహేజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి.

గుజరాత్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 40 మందికి గాయాలు

అహ్మదాబాద్: గుజరాత్‌లోని దహేజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడులో 40 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది... వెంటనే స్పందించి 10 అగ్నిమాపక ఇంజన్లతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.


ఇంతటి భారీ పేలుడు సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఈ కెమికల్ విష పూరితం కావడంతో పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించామని, వారికి మెరుగైన వైద్యం అందేట్టు చూస్తున్నామని అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-06-03T21:57:02+05:30 IST