సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర పేలుడు

ABN , First Publish Date - 2020-10-25T15:21:34+05:30 IST

భాగ్యనగరంలోని సికింద్రాబాద్‌లో గల ముత్యాలమ్మ దేవాలయం ముందు పేలుడు సంభవించింది.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర పేలుడు

హైదరాబాద్ : భాగ్యనగరంలోని సికింద్రాబాద్‌లో గల ముత్యాలమ్మ దేవాలయం దగ్గర పేలుడు సంభవించింది. చెత్తకుప్పలో కెమికల్ డబ్బా పేలి రాజు అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి.! ఈ ఘటన రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోటుచేసుకోవడంతో కలకలం రేగింది. క్షతగాత్రుడ్ని హుటాహుటిన స్థానికంగా ఉన్న గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న డాగ్, బాంబ్ స్క్వాడ్ నిశితంగా పరిశీలిస్తోంది. గాయపడిన వ్యక్తి నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు సమాచారం. అమ్మవారి గుడికి దగ్గర్లో దసరా పండుగ పూట ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పేలుడుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-25T15:21:34+05:30 IST