రక్తదానంతో నిండు ప్రాణం కాపాడవచ్చు

ABN , First Publish Date - 2022-01-20T04:40:00+05:30 IST

రక్తదానంతో విపత్తు సమయంలో నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు.

రక్తదానంతో నిండు ప్రాణం కాపాడవచ్చు
రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొరముట్ల, ఎస్పీ అన్బురాజన్‌

చిట్వేలి, జనవరి 19: రక్తదానంతో విపత్తు సమయంలో నిండు ప్రాణాన్ని కాపాడవచ్చని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని రాజుకుంట క్రాస్‌ చెక్‌పోస్టు వద్ద చిట్వేలి పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాజుకుంట యువత సహకారంతో చిట్వేలి స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కడప ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సంస్థ బృహదా ప్రతినిధుల బృందం రక్తాన్ని సేకరించారు. 99 సార్లు రక్తదానం చేసిన దాత దొండ్ల వాగు వేణుగోపాల్‌ను ఎస్పీ అన్బురాజన్‌, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అభినందించారు. కార్యక్రమంలో రాజుకుంట సర్పంచ్‌ గుత్తి నరసింహా, ఎంపీటీసీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-20T04:40:00+05:30 IST