పక్కింటికి వెళ్లిందని కూతురిని కర్రతో కొట్టి, క్యాండిల్‌తో కాల్చి..

ABN , First Publish Date - 2021-07-09T22:01:39+05:30 IST

ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లొద్దని ఎంత చెప్పినా వినట్లేదని కూతుర్ని కొట్టి, కుడి చేతిని కాల్చిందో తల్లి. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి బయటికి వెళ్లడం గమనించిన తొమ్మిదేళ్ల

పక్కింటికి వెళ్లిందని కూతురిని కర్రతో కొట్టి, క్యాండిల్‌తో కాల్చి..

బెంగుళూరు: ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లొద్దని ఎంత చెప్పినా వినట్లేదని కూతుర్ని కొట్టి, కుడి చేతిని కాల్చిందో తల్లి. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి బయటికి వెళ్లడం గమనించిన తొమ్మిదేళ్ల కూతురు ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లింది. కొద్దిసేపటికే తిరిగి వచ్చిన తల్లికి ఇంట్లో కూతురు కనిపించకపోవడంలో చుట్టు పక్కల వెతికింది. పక్కింట్లో ఆడుకుంటున్న కూతుర్ని తీసుకెళ్లి.. మొదట కర్రతో కొట్టి తరువాత క్యాండిల్‌తో కుడిచేతిని కాల్చింది. సోమవారం బాలిక ఆడుకుంటుండగా కిందపడి కాలిన చోటే మళ్లీ గాయమైంది. దీంతో తల్లి వెంటనే కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కాలిన గాయాలను గమనించిన డాక్టర్ పోలీసులకు సమాచారమివ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. చిన్నకూతురు తల్లితో, పెద్ద కూతురు తండ్రితో వేర్వేరుగా ఉంటున్నారు. పొరుగింటి వాళ్లు సూటిపోటి మాటలనడంతో చిరాకులో ఉన్న ఆమె కూతుర్ని కొట్టి, చెయ్యి కాల్చింది.

Updated Date - 2021-07-09T22:01:39+05:30 IST