చెన్నై ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన బీఎండబ్ల్యూ

ABN , First Publish Date - 2020-06-01T23:48:59+05:30 IST

ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ నేడు చెన్నై ప్లాంట్‌లో

చెన్నై ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన బీఎండబ్ల్యూ

చెన్నై: ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ నేడు చెన్నై ప్లాంట్‌లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. 50 శాతం మంది కంటే తక్కువ సిబ్బందితో పనులు ప్రారంభించింది. కోవిడ్-19 నేపథ్యంలో ప్లాంట్‌లో పూర్తి రక్షణ చర్యలు చేపట్టింది.  ఇందులో భాగంగా కార్యాలయాలు, ప్లాంట్, డీలర్‌షిప్ లే అవుట్లను రీడిజైన్ చేసింది. భౌతిక దూరం తప్పకుండా పాటించేలా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే, అన్ని ప్రదేశాలను పూర్తిగా శానిటైజ్ చేసింది. 


బీఎండబ్ల్యూ, మినీ, బీఎండబ్ల్యూ మోటార్డ్ డీలర్‌‌షిప్‌లు షోరూమ్‌లలోని అని ప్రదర్శిత వాహనాల శానిటైజేషన్‌కు భరోసా ఇచ్చేలా ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అమలు చేశాయి. వినియోగదారులకు నచ్చిన ప్రదేశంలో కొత్త, సర్వీసు వాహనాలను అందించనుంది. డెలివరీకి ముందు ప్రతీ వాహనాన్ని ముందుగా శానిటైజ్ చేయనుంది. టెస్టు డ్రైవ్ వాహనాలు అందుబాటులోనే ఉన్నాయి. ఇందుకోసం సంబంధిత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. అలాగే, అన్ని టెస్ట్ డ్రైవ్ వాహనాల్లో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయి.  

Updated Date - 2020-06-01T23:48:59+05:30 IST