రుషికొండ బీచ్‌లో బోటు షికార్‌ పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-06-23T05:12:59+05:30 IST

రుషికొండ బీచ్‌లో రెండు నెలలుగా మూతపడిన బోటు షికార్‌ మంగళవారం నుంచి పునఃప్రారంభమైంది.

రుషికొండ బీచ్‌లో బోటు షికార్‌ పునఃప్రారంభం
బోటు షికార్‌ చేస్తున్న సందర్శకులు

సాగర్‌నగర్‌, జూన్‌ 22: రుషికొండ బీచ్‌లో రెండు నెలలుగా మూతపడిన బోటు షికార్‌ మంగళవారం నుంచి పునఃప్రారంభమైంది. కొవిడ్‌ కారణంగా విధించిన కర్ఫ్యూతో రుషికొండ బీచ్‌లోకి పర్యాటకులను అనుమతించకపోవడంతో బోటు షికారును నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో సడలింపులివ్వడంతో మంగళవారం నుంచి పర్యాటకశాఖ కార్యకలాపాలను ప్రారంభించింది. మంగళవారం బీచ్‌కు వచ్చిన పలువురు సందర్శకులు బోటు షికార్‌ చేసేందుకు ఆకస్తి కనబరిచారు. దీంతో సముద్రపు అలలపై ఉల్లాసంగా..ఉత్సాహంగా బోటు షికార్‌ చేశారు. కాగా కర్ఫ్యూ సడలింపు వల్ల తమ వ్యాపారాలు బాగా సాగి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతామని స్థానిక వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-23T05:12:59+05:30 IST