‘రాజగృహం ధ్వంసం హేయం’

ABN , First Publish Date - 2020-07-14T10:21:51+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నివాసం (రాజగృహం)ను ధ్వంసం చేయడం హేయనీయమని డీసీసీ అధ్యక్షురా లు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు.

‘రాజగృహం ధ్వంసం హేయం’

గుజరాతీపేట, జూలై 13: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నివాసం (రాజగృహం)ను  ధ్వంసం చేయడం హేయనీయమని డీసీసీ అధ్యక్షురా లు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు.సోమవారం ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజగృహానికి తగిన భద్రత లేకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. తక్షణం భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు. నిందితులను తక్షణం అదుపులోకి తీసుకోవాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్లాని సత్యవతి డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు సనపల అన్నాజీరావు, అఖినేని నారా యణరావు, డి.గోవింద మల్లిబాబు, బస్వా షణ్ముఖరావు, ఏవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, రెల్ల సురేష్‌, బైరి రాజేశ్వరరావు ఉన్నారు.

Updated Date - 2020-07-14T10:21:51+05:30 IST