ఏడాది క్రితమే ఇద్దరికీ పెళ్లి నిశ్చయం.. మధ్యలో ఓ యువతి ఎంట్రీ.. చివరకు జరిగిన ఘోరమిది

ABN , First Publish Date - 2021-08-04T17:32:11+05:30 IST

ఏడాది క్రితమే వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.. మధ్యలో మరో యువతి రావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి..

ఏడాది క్రితమే ఇద్దరికీ పెళ్లి నిశ్చయం.. మధ్యలో ఓ యువతి ఎంట్రీ.. చివరకు జరిగిన ఘోరమిది

ఏడాది క్రితమే వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది.. మధ్యలో మరో యువతి రావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.. తాజాగా వారిద్దరూ అడవిలోని ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు.. దీంతో ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.. అక్కడకు డాగ్ స్క్వాడ్‌తో చేరుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.. గుజరాత్‌లోని అరవిల్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


శ్యామలాజీ గ్రామానికి చెందిన సంజీవ్‌కు, వాడ్ గ్రామానికి చెందిన సన్యాబెన్‌కు గతేడాది నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం తర్వాత మరో యువతితో సంజీవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. వరుడిపై వధువు తండ్రి కేసు కూడా పెట్టాడు. అయితే సంజీవ్‌ అంటే బాగా ఇష్టపడిన సన్యాబెన్ అతడిని తప్ప వేరొకరిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడలేదు. కేసులు, ఇరు కుటుంబాల మధ్య గొడవలతో ఈ పెళ్లి సాధ్యం కాదని తేలడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. సమీపంలోని అడవికి వెళ్లి ఓ చెట్టు ఎక్కి ఉరేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2021-08-04T17:32:11+05:30 IST