బోగోలులో ప్రపంచ ఆదివాసి దినోత్సవం
ABN , First Publish Date - 2022-08-10T04:17:08+05:30 IST
బోగోలులో మంగళవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం గిరిజన నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బిట్రగుంట, ఆగస్టు 9: బోగోలులో మంగళవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం గిరిజన నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి, గిరిజన సంఘాల జేఏసీలు సంయుక్తంగా తిప్ప రామాపురం కూడలిలోని ఏకలవ్య విగ్రహానికి పూల మాల వేసి జేజేలు పలికారు. గిరిజన సంఘాల జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాటి క్రాంతి కుమార్, ఏఐవైహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన తిప్ప జాతీయ రహదారి నుంచి బోగోలు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోగోలు కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సముద్రాల దావీదు, ఏఐవైహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఎస్టీ సెల్ లీగల్ అడ్వవైజర్ గుర్రంకొండ సర్దార్, బీజేపీ జిల్లా ఎస్టీసెల్ నేత ఎస్.వెంకటేశ్వర్లు, బోగిరి యోహాను, దేవరకొండ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కప్పరాళ్ళతిప్ప గ్రామ ఎరుకుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోగోలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆవుల దావీదు, ఆకుల డేవిడ్ పాల్, వైసీపీ మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు మేకల.సాల్మన్రాజు, వరప్రసాద్, గుంజ.బాబు, పీట్ల.మహేష్, జ్యోషి, విజయ్చంద్ర తదితరులు పాల్గొన్నారు.