విజయనగరం జిల్లాలో బోగస్ చలానాల కలకలం

ABN , First Publish Date - 2021-08-13T01:11:59+05:30 IST

జిల్లాలోని గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బోగస్ చలానాల

విజయనగరం జిల్లాలో బోగస్ చలానాల కలకలం

విజయనగరం: జిల్లాలోని గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బోగస్ చలానాల అంశం కలకలం సృష్టించింది. అధికారుల తనిఖీల్లో డాక్యుమెంట్ రైటర్ల బాగోతం బయటపడింది. సుమారు రూ.21  లక్షల విలువ చేసే 69 బోగస్ చలనాలను అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్లపై పోలీసులకు సబ్ రిజిస్ట్రార్ ఆర్.ఈశ్వరమ్మ ఫిర్యాదు చేసింది. డాక్యుమెంట్ రైటర్ సేనాపతి గణేష్ సహా...మరో నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-08-13T01:11:59+05:30 IST