UAE లో నటుడు వరుణ్ ధావన్‌కు అరుదైన గౌరవం..

ABN , First Publish Date - 2021-11-24T19:05:16+05:30 IST

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌కు యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.

UAE లో నటుడు వరుణ్ ధావన్‌కు అరుదైన గౌరవం..

దుబాయ్: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌కు యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితితో వరుణ్‌కు యూఏఈ ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. తాజాగా వరుణ్ దుబాయ్‌లో గోల్డెన్ వీసా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. "నాకు యూఏఈ కొత్తకాదు. ఇప్పటివరకు పలుమార్లు సినిమాల చిత్రీకరణ కోసం దుబాయ్‌కు రావడం జరిగింది. మూవీలకు యూఏఈ మంచి డెస్టినేషన్. గోల్డెన్ వీసా జారీ చేసిన యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. ఇక కరణ్ జోహర్ మూవీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో వెండితెరకు పరిచయమైన ధావన్ ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన 'జుగ్ జుగ్జ్ జీయో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 


ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ, సంజయ్ కపూర్, ఊర్వశి రౌతేలా, ఫరా ఖాన్ కుందన్, సోను నిగమ్ ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు నటి త్రిషా, సీనియర్ గాయని కేఎస్ చిత్ర, క్రీడాకారిణి సానియా మీర్జా కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. 

Updated Date - 2021-11-24T19:05:16+05:30 IST