బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు
ABN , First Publish Date - 2021-12-01T06:05:19+05:30 IST
స్థానిక ఎస్ఐ ఆర్.సంతోశ్ ఆధ్వ ర్యంలో మంగళవారం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.
ముంచంగిపుట్టు, నవంబరు 30: స్థానిక ఎస్ఐ ఆర్.సంతోశ్ ఆధ్వ ర్యంలో మంగళవారం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. డిసెంబరు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ 21వ వార్షికోత్సవం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రం నుంచి రూడకోట, జోలాపుట్టు, పెదబయలు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల ఇరువైపులా వంతెనలు, కల్వర్టుల కిందన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నది. సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ పోలీసులు మండల కేంద్రంతోపాటు ప్రధాన జంక్షన్ల వద్ద విస్తృత వాహన తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి విడిచిపెడుతున్నారు.