అమ్మోర్లకు బోనం
ABN , First Publish Date - 2022-01-24T05:09:39+05:30 IST
అమ్మోర్లకు బోనం
కొడంగల్ రూరల్/తాండూరు రూరల్/వికారాబాద్, జనవరి 23: కొడంగల్ పట్టణం గాంధీనగర్లో ఆదివారం బోనమ్మ, సుందరమ్మ అమ్మవార బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల నడుమ మహిళలు గ్రామంలో బోనాలతో ఊరేగింపునిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. ప్రజలను చల్లంగా చూడాలని, పంటలుబాగా పండాలని మొక్కుకున్నారు. కాగా వికారాబాద్ మండల పరిధిలోని కొత్రేపల్లి గ్రామంలో మైసమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే ఆనంద్ పూజల్లో పాల్గొన్నారు. తాండూరు మండలం వీరారెడ్డిపల్లిలో ఊరడమ్మ బోనాల పండుగను ఘనంగా న్విహించారు. ఏర్పులమ్మ భవిష్యవాణి వినిపించింది.