ప్రవీణ్ చక్రవర్తిని పెంచి పోషిస్తున్నది వైసీపీనే: బోండా ఉమా
ABN , First Publish Date - 2021-01-17T14:40:03+05:30 IST
రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై దాడులు చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని పెంచి పోషిస్తున్నది వైసీపీనే..
విజయవాడ: రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై దాడులు చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని పెంచి పోషిస్తున్నది వైసీపీనే అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి గ్యాంగ్లు చాలా వున్నాయని, ఒక పధకం ప్రకారమే 140 దేవాలయాల్లో వైసీపీ అండతో దాడులు చేశారని విమర్శించారు. వైసీపీ అండలేకపోతే ఇన్ని విగ్రహాలు ద్వంసం చేయటం సాధ్యమా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ చక్రవర్తి వెనుక వున్న అసలు కుట్ర దారులను పట్టుకొనే దమ్ము ప్రభుత్వానికి వుందా? అని బోండా ఉమా నిలదీశారు.