కోర్టు తీర్పులే వైసీపీ పాలనకు నిదర్శనం: బోండా ఉమ

ABN , First Publish Date - 2020-06-03T22:16:18+05:30 IST

వైసీపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ఏ విధంగా పరిపాలిస్తుందో..

కోర్టు తీర్పులే వైసీపీ పాలనకు నిదర్శనం: బోండా ఉమ

అమరావతి: వైసీపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ఏ విధంగా పరిపాలిస్తుందో.. కోర్టుల్లో వచ్చిన తీర్పులే నిదర్శనమని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు 65 సార్లు ప్రభుత్వ పాలన తప్పుల కుప్పగా ఉందని, రాజ్యాంగానికి అతీతంగా ఉందని, చట్టాల్ని అతిక్రమిస్తోందని చీవాట్లు పెట్టినా.. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పంచాయతీ కార్యాలయాలకు కూడా వైసీపీ రంగులు వేశారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని బోండా ఉమ అన్నారు.

Updated Date - 2020-06-03T22:16:18+05:30 IST