అందుకే జగన్ తన ఎంపీలను ఆ దేశం పంపారు: బోండా ఉమా

ABN , First Publish Date - 2020-02-22T19:17:48+05:30 IST

మంగళగిరి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మారల్చేందుకే..

అందుకే జగన్ తన ఎంపీలను ఆ దేశం పంపారు: బోండా ఉమా

మంగళగిరి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మారల్చేందుకే సిట్ ఏర్పాటు చేశారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు సీఎం జగన్ తన ఎంపీలను ఆ దేశం పంపారన్నారు. రస్ ఆల్ ఖైమా విషయంలో వైసీపీ నేతలు ఎందుకు కిక్కురుమనడం లేదని ప్రశ్నించారు. జగన్‌ను నేరస్థుల ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి జగన్‌ను అప్పగించే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైజాగ్‌లో ఇప్పుడు సచివాలయం ఎక్కడ పెడతారు!?.. 5 లక్షల ఎస్ఎఫ్‌టీ స్థలం ఎక్కడ ఉందని బోండా ఉమా ప్రశ్నించారు.


Updated Date - 2020-02-22T19:17:48+05:30 IST