రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలన: బోండా ఉమ

ABN , First Publish Date - 2021-10-20T00:45:39+05:30 IST

రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలన చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా..

రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలన: బోండా ఉమ

విజయవాడ: రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలన చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. ఇక్కడ చట్టం ఉందా? తాలిబన్ పాలన ఉందా?, వైసీపీ అవినీతిని ఎత్తి చూపితే దాడులా? అని ఆయన ప్రశ్నించారు. 


ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేశారు. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ కార్యాలయాలపైనా వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా దాడి జరిగింది. అంతేకాదు పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. 

Updated Date - 2021-10-20T00:45:39+05:30 IST