టీటీడీ ఆస్తుల్ని అమ్మి దోచుకోవాలని ప్రభుత్వం కుట్ర: బోండా ఉమ
ABN , First Publish Date - 2020-05-26T00:23:06+05:30 IST
టీటీడీ ఆస్తుల్ని అమ్మి దోచుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. దొరికిపోయిన దొంగలు మాట మార్చి ప్రజలను...
విజయవాడ: టీటీడీ ఆస్తుల్ని అమ్మి దోచుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. దొరికిపోయిన దొంగలు మాట మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా టీడీపీపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. తాము అనేక నిర్ణయాలపై సబ్కమిటీలు వేశామన్నారు. గతంలో అమ్మాలని బోర్డు పరంగా నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఇసుక, పేదలకు స్థలాల పేరుతో దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు స్వామివారి ఆస్తులు దోచుకోవాలని చూస్తున్నారన్నారు. కొందరు స్వాములు కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బోండా ఉమ ధ్వజమెత్తారు.