కొడాలి నాని కాదు.. కేసినో నాని: బోండా ఉమ

ABN , First Publish Date - 2022-01-27T18:40:05+05:30 IST

ఆయన కొడాలి నాని కాదు.. కేసినో నాని అంటూ టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.

కొడాలి నాని కాదు.. కేసినో నాని: బోండా ఉమ

విజయవాడ: ఆయన కొడాలి నాని కాదు.. కేసినో నాని అంటూ టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. గురువారం టీడీపీ బృందం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌‌ను కలిసింది. అనంతరం బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ  గుడివాడలో కేసినో జూదం గురించి గవర్నర్‌‌కు ఫిర్యాదు చేశామన్నారు. కేసినోను సీఎం జగన్‌ మాత్రమే చూడలేకపోతున్నారని అన్నారు. కేసీనో జరిగిందని సాక్ష్యాధారాలతో భయటపెడితే.. దానిపై సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గుడివాడలో వైసీపీ విష సంస్కృతిని ప్రవేశపెట్టిందని విమర్శించారు. మంత్రి కొడాలి నాని అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి ఊడిపోతుందనే భయంతో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని బోండా ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-27T18:40:05+05:30 IST