కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్, ప్రమోషన్లు
ABN , First Publish Date - 2021-03-05T06:39:32+05:30 IST
ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్.. ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. 24,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు ఉద్యోగులందరికీ బోనస్ ఇవ్వను న్నట్లు ప్రకటించింది
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్.. ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. 24,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు ఉద్యోగులందరికీ బోనస్ ఇవ్వను న్నట్లు ప్రకటించింది. ఈ బోనస్ 2019లో చెల్లించిన బోనస్ కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. వీటికి తోడు సీనియర్ అసోసియేట్స్, అంతకంటే కింది స్థాయి ఉద్యోగులకు ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. నిపుణులైన ఉద్యోగులు వేరే కంపెనీలకు మారకుండా కాపాడుకునేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.