పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2022-01-21T04:35:54+05:30 IST

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌కి చెందిన ప్రొఫెసర్‌ రొక్కం రాధాకృష్ణ రచించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పోర్టు గెస్ట్‌హౌస్‌లో గురువారం ఆవిష్కరించారు.

పుస్తకావిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌కి చెందిన ప్రొఫెసర్‌ రొక్కం రాధాకృష్ణ రచించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పోర్టు గెస్ట్‌హౌస్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయితతో పాటు పలువురు ప్రొఫెసర్లు, రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖల మంత్రి సీదరి అప్పలరాజు పాల్గొన్నారు. 

ఉపరాష్ట్రపతికి పీవీ పుస్తకం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై రచయిత శంకర్‌ నీలు భాగవతుల రాసిన ‘పీవీ నరసింహారావు.. భారత జాతి పునరుజ్జీవ శక్తి’ పుస్తకాన్ని పోర్టు గెస్ట్‌హౌస్‌లో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏక్‌స్థల్‌లో పీవీ విగ్రహం ఏర్పాటుకు వెంకయ్యనాయుడు చేసిన కృషిని గుర్తుచేసి కృతజ్ఞతలు తెలియజేశారు. 


Updated Date - 2022-01-21T04:35:54+05:30 IST