చల్‌ చలో..

ABN , First Publish Date - 2020-04-05T15:59:18+05:30 IST

లాక్‌డౌన్‌ గడువు ఈనెల 14తో ముగియనున్న నేపథ్యంలో ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు..

చల్‌ చలో..

ఆపరేషన్లకు ఏఏఐ, రైల్వే, ఆర్టీసీ సిద్ధం

యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోమన్న పౌరవిమానయాన శాఖ

15 నుంచి విమాన సర్వీసులకు బుకింగ్స్‌

రైల్వే, ఆర్టీసీ కూడా అదేబాటలో..


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): లాక్‌డౌన్‌ గడువు ఈనెల 14తో ముగియనున్న నేపథ్యంలో ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు విమానయా నం, రైల్వే, ఆర్టీసీ సంసిద్ధమవుతున్నాయి. లాక్‌డౌన్‌ను కొనసాగించడం పై కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో పాటు దశల వారీగా లాక్‌డౌన్‌కు మినహాయింపునిచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కేం ద్ర వర్గాల సమాచారం. దీంతో కేంద్ర రవాణా సంస్థలైన విమానయా నం, రైల్వే శాఖలు 15 నుంచి బుకింగ్స్‌ ప్రారంభించాయి. విజయవాడ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధికారులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ నుంచి పలు సూచనలు అందాయి.


విమాన విజయవాడ నుంచి ఎయిర్‌ ఇండియా మినహా స్పైస్‌జెట్‌, ఇండిగో, ట్రూజెట్‌ విమానయాన సంస్థలు 15నుంచి బుకింగ్స్‌ ప్రారంభించాయి. ఎయిర్‌ ఇండియా మాత్రం 30నుంచి సర్వీసులు నడపనున్నట్టు ప్రక టించింది. రైల్వేలో 15నుంచి ఆన్‌లైన్‌ రిజర్వేషన్లకు ఐఆర్‌సీటీసీ అవకా శం కల్పించింది. ప్రస్తుతానికి విజయవాడ మీదుగా వెళ్లే 127 రైళ్లకు బుకింగ్స్‌కు అవకాశం కల్పించింది. ఆర్టీసీలో కూడా 15 నుంచి దూర ప్రాంత సర్వీసులకు రిజర్వేషన్‌ సదుపాయాన్ని ఓపీఆర్‌ఎస్‌ ద్వారా కల్పించారు. ఏసీ సర్వీసులకు మాత్రం రిజర్వేషన్‌ కల్పించలేదు.ఈ ప్రజలు ఆసక్తి చూపకపోవచ్చనే భావనలో అధికారులు ఉన్నారు.

Updated Date - 2020-04-05T15:59:18+05:30 IST