కరాటేతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది: సీఐ
ABN , First Publish Date - 2021-08-02T05:49:44+05:30 IST
కరాటేతో మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొం దిస్తుందని సీఐ కరుణాకర్ తెలిపారు.
ధర్మవరం, ఆగస్టు 1: కరాటేతో మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొం దిస్తుందని సీఐ కరుణాకర్ తెలిపారు. జూలై 25న ఆనలైనలో బుడోఖాన కరాటే ఇంటర్నే షనల్ కటా చాంపియన షిప్ నిర్వహిం చారు. ఇందులో ధర్మవరానికి చెందిన మల్టీస్టార్ ఆలిండియా బుడో ఖాన కరాటే అకాడమీ విద్యార్థులు మమత, నవ్యశ్రీ, సాయి హాసిని, రితిక సుమిత్ర, విష్ణుకాంత, అర్జితచెన్నయ్య, జశ్వంత, ఉమా మహేశ్వర్, రిషికేశ, చరణ్కిష్ట కటా విభాగంలో ప్రతిభ కనబ రచినట్టు కరాటే మాస్టర్ ఇనా యతబాషా తెలిపారు. ఈ నేపధ్యం లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు రాగా వాటిని ఆది వారం సీఐ కరుణాకర్ అందజేశారు. అనంతరం సీఐ మాట్లాడు తూ...కరాటే మనకు ఆత్మరక్షణతో దోహదపడుతుందన్నారు. కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ధర్మవ రానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్ర మంలో కరాటే మాస్టర్లు గీతావాణి, శ్రీనాథ్ నాయుడులు పాల్గొన్నారు.