విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-03-07T01:10:14+05:30 IST
జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేంపల్లె మండలంలో
కడప: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేంపల్లె మండలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మండల పరిధిలోని పాపాగ్నినది కప్పలమడుగు దగ్గర ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిని మహేష్(20) పఠాన్ అమీర్(21)లుగా గుర్తించారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.