కరోనాతో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-05-17T06:45:11+05:30 IST

బీఎన్‌ కండ్రిగ మండలం కుక్కంబాకం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా చికిత్స పొందుతూ ఒకరు, కరోనా పాజిటివ్‌ అని తెలిసి గుండె ఆగి మరొకరు ఆదివారం ప్రాణాలు వదిలారు.

కరోనాతో ఇద్దరి మృతి

చికిత్సపొందుతూ ఒకరు.. పాజిటివ్‌ అని తెలిసి మరొకరు

 

బుచ్చినాయుడుకండ్రిగ, మే 16: బీఎన్‌ కండ్రిగ మండలం కుక్కంబాకం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా చికిత్స పొందుతూ ఒకరు, కరోనా పాజిటివ్‌ అని తెలిసి గుండె ఆగి మరొకరు ఆదివారం ప్రాణాలు వదిలారు. కుక్కంబాకం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య(68) ఆస్తమాతో బాధపడుతూ శనివారం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలారు. శవ పరీక్ష నిర్వహించగా కరోనా అని తేలింది. అదే గ్రామానికి చెందిన మీరయ్య(70) రెండు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు.  శనివారం పాజిటివ్‌ ఉన్నట్లు సమాచారం అందింది. ఈ విషయం తెలిసిన మీరయ్య గుండెపోటు వచ్చి ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకున్నాయి. 

Updated Date - 2021-05-17T06:45:11+05:30 IST