ఆ రెండే కీలకం
ABN , First Publish Date - 2020-08-13T09:04:41+05:30 IST
స్వర్ణాప్యాలెస్లో అగ్ని ప్రమాదం రెండు ప్రదేశాల నుంచి సంభవించిందని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. హోటల్లోని ఫ్రంట్ ఆఫీస్ (రి
విజయవాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : స్వర్ణాప్యాలెస్లో అగ్ని ప్రమాదం రెండు ప్రదేశాల నుంచి సంభవించిందని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. హోటల్లోని ఫ్రంట్ ఆఫీస్ (రిసెప్షన్), దానికి వెనుకవైపు ఉన్న సర్వర్ రూమ్ నుంచి మంటలు వ్యాపించాయని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్ ఉపసంచాలకుడు సురేష్, సీఈఐజీ (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ గవర్నమెంట్) అధికారులు విజయలక్ష్మి తదితరులు హోటల్లో బుధవారం సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు.
ఇప్పటికే నాలుగు అంతస్తులను పరిశీలించి కొన్ని నమూనాలు సేకరించిన అధికారులు పూర్తిస్థాయి విశ్లేషణ కోసం బుధవారం అన్ని అంతస్తులను పరిశీలించి సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు. ఫ్రంట్ ఆఫీస్, సర్వర్ రూమ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ తీగలు, ఇతరత్రా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మంటలకు మసైపోయిన హోటల్ కింది అంతస్తు మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరించారు.