ఇద్దరి రిమాండ్‌

ABN , First Publish Date - 2021-04-21T05:29:18+05:30 IST

డిచ్‌పల్లి గ్రామానికి చెందిన మహమ్మాద్‌ హాజీ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

ఇద్దరి రిమాండ్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 20:  డిచ్‌పల్లి గ్రామానికి చెందిన మహమ్మాద్‌ హాజీ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆజీ పెద్దనాన్న హుస్సేన్‌ స్థలం విషయంలో గొడవపడి గాయపర్చినందు వల్లే ఆజీని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అలాగే బర్దీపూర్‌కు చెందిన బోర్గాం అన్వేష్‌ను పాత కక్ష్యలతో గొడవపడి కొట్టినందుకు అదే గ్రామానికి చెందిన వేముల సాయన్న అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 


Updated Date - 2021-04-21T05:29:18+05:30 IST