బండ‌రాయి ప‌డి నుజ్జునుజ్జ‌యిన కారు... క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన ఇద్ద‌రు ప్ర‌యాణికులు

ABN , First Publish Date - 2021-06-12T18:13:30+05:30 IST

మహారాష్ట్రలోని థానే, అహ్మద్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లో...

బండ‌రాయి ప‌డి నుజ్జునుజ్జ‌యిన కారు... క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన ఇద్ద‌రు ప్ర‌యాణికులు

థానే: మహారాష్ట్రలోని థానే, అహ్మద్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లో గ‌ల‌ మల్షెజ్‌ఘాట్ ప్రాంతంలో టీ తాగేందుకు కారు నుంచి దిగిన‌ ఇద్దరు ప్ర‌యాణికులు ఘోర ప్ర‌మాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో కారు పూర్తిగా దెబ్బతిన్న‌ద‌ని పోలీసులు తెలిపారు. పెద్ద‌బండ‌రాయి కారుపై ప‌డ‌టానికి కొద్ది నిముషాల మందు కారు నుంచి ఇద్దరు వ్యక్తులు టీ తాగడానికి కింద‌కు దిగ‌డంతో ప్రాణాలు కాపాడుకోగ‌లిగార‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న కార‌ణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిందని అన్నారు. అయితే హైవే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, అహ్మద్ నగర్ వైపు వెళ్లే వాహనాలకు లైన్ క్లియ‌ర్ చేసిన‌ట్లు వివ‌రించారు. ఇదిలావుండ‌గా ముంబైతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంద‌ని వాతావరణ శాఖ తెలియ‌జేసింది. ఈ నేప‌ధ్యంలో మహారాష్ట్రలోని రత్నగిరి, రాయగఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

Updated Date - 2021-06-12T18:13:30+05:30 IST