మణిదీ్పరెడ్డికి విల్లు బహూకరణ
ABN , First Publish Date - 2022-01-27T05:59:22+05:30 IST
విలువిద్యలో పతకాలు సాధిస్తున్న గొర్రెపాటి మణిదీ్పరెడ్డి దేశానికి బంగారు పతకాలు సాధించి పెట్టాలని రామయ్య ట్రస్ట్ చైర్మెన్ ఉన్నం నళినీదేవి పేర్కొన్నారు.
లింగసముద్రం, జనవరి 26 : విలువిద్యలో పతకాలు సాధిస్తున్న గొర్రెపాటి మణిదీ్పరెడ్డి దేశానికి బంగారు పతకాలు సాధించి పెట్టాలని రామయ్య ట్రస్ట్ చైర్మెన్ ఉన్నం నళినీదేవి పేర్కొన్నారు. బుధవారం లింగసముద్రం పంచాయితీలోని అయ్యప్పస్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ట్రస్ట్ తరఫున రూ.3 లక్షల విలువైన విల్లును మణిదీ్పరెడ్డికి అందజేశారు. వాకమళ్లవారిపాలెం గ్రామానికి చెందిన గొర్రెపాటి విజయభాస్కర్రెడ్డి కుమారుడు మణిదీ్పరెడ్డి కడప కళాశాలలో ఇంటర్ చదువుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా నళినిదేవి మాట్లాడుతూ, విలువిద్యలో మణిదీ్పరెడ్డి ప్రతిభ తెలుసుకొని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా అతని ప్రతిభ మరుగున పడి పోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు ఉన్నం హరిబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు ఎం.ఏడుకొండలు సర్పంచ్ పులి రాఘవులు, వైసీపీ నాయకులు ఎం.కొండలరావు, మాజీ ఎంపీపీ పి.బాలకోటయ్య, పి.తిరుపతిరెడ్డి, ఎస్కే షఫీ, తదితరులు పాల్గొన్నారు.