బోయినపల్లిలో బావపై బిందెతో దాడి..
ABN , First Publish Date - 2021-05-01T15:56:32+05:30 IST
బావపై బావమరిది బిందెతో దాడిచేసిన సంఘటన బోయినపల్లి
హైదరాబాద్/బోయినపల్లి : బావపై బావమరిది బిందెతో దాడిచేసిన సంఘటన బోయినపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. 2016లో మల్కాజిగిరికి చెందిన నవీన్కుమార్కు గౌలిగూడకు చెందిన హిమబిందుతో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి కొంతకాలంగా కుటుంబపరమై న సమస్యలతో ఇబ్బందినెదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ నవీన్, హిమబిందును తీసుకొని న్యూబోయినపల్లిలోని తన సోదరి సరిత ఇంటికి వచ్చాడు. బంధువులందరూ కలిసి హిమబిందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోని ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. తర్వాత నవీన్ బావమరుదులు వీరేందర్, శ్రీకాంత్లు సరిత ఇంటికి వచ్చి నవీన్ను దుర్భాషలాడారు. కోపంతో రగిలిపోయిన వీరేందర్ బిందెతో బావ నవీన్పై దాడిచేశాడు. ఈ దాడిలో గాయాలపాలైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.