బాక్సింగ్ ఫెడరేషన్ ఈడీ సచేటి కరోనాతో కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-04T22:22:59+05:30 IST

భారత బాక్సింగ్ ఫెడరేషన్ ఈడీ సచేటి కరోనాతో మంగళవారం కన్నుమూశారు....

బాక్సింగ్ ఫెడరేషన్ ఈడీ సచేటి కరోనాతో కన్నుమూత

న్యూఢిల్లీ : భారత బాక్సింగ్ ఫెడరేషన్ ఈడీ సచేటి కరోనాతో మంగళవారం కన్నుమూశారు. 56 ఏళ్ల వయసున్న ఆర్కే సచేటి కొవిడ్-19 తో పోరాడుతూ మృత్యువాత పడ్డారు. కరోనా సోకిన సచేటి గత రెండు రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటరుపై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2016లో సచేటి బాక్సింగ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అయ్యారు. భారత క్రీడాలోకానికి దక్షత గల నిర్వాహకుడిగా సచేటి సేవలందించారని బాక్సింగ్ ఫెడరేషన్ పేర్కొంది. సచేటి మృతి పట్ల కేంద్ర క్రీడాశాఖమంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. ఒలింపిక్ టాస్కు ఫోర్సు సభ్యుడు కూడా అయిన సచేటి భారత బాక్సర్లు ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటేలా సమాయత్తపర్చారు.


Updated Date - 2021-05-04T22:22:59+05:30 IST