HYD : బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో బాలుడు

ABN , First Publish Date - 2021-12-31T12:07:37+05:30 IST

పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి ...

HYD : బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో బాలుడు

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన 17ఏళ్ల బాలుడిని రాజేంద్రనగర్‌ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఇంటి యజమాని కుమార్తె పట్ల అద్దె ఇంట్లోని బాలుడు అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తల్లికి చెప్పడంతో వారిని ఇల్లు ఖాళీ చేయించారు. 


యజమాని కూడా ఇంటిని అమ్మి వేరే ప్రాంతంలో ఉంటున్నారు. ఈనెల 28న బాలుడు గుడికి వెళదామని చెప్పి ఆ బాలికను బైక్‌పై ఎక్కించుకుని శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడు స్వగ్రామమైన కర్ణాటకలోని గుల్బర్గాకు పారిపోవాలని ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం బాలుడిని జువెనైల్‌ బోర్డు ముందు ప్రవేశపెడతామని చెప్పారు.

Updated Date - 2021-12-31T12:07:37+05:30 IST