వాటర్ ట్యాంక్లో పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-06-12T05:20:05+05:30 IST
వాటర్ ట్యాంక్లో పడి బాలుడి మృతి
దుగ్గొండి(నల్లబెల్లి), జూన్ 11: ఇంటిపై నిర్మించిన వాటర్ ట్యాంక్లో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నల్లబెల్లి మండలంరం గాపురంలో శుక్ర వారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రంగా పురంనకు చెంది న ఉప్పుల మధు, రోహిణి దంపతులకు కుమారులు బన్ని, లక్కీ(5) ఉన్నారు. వ్యవ సాయం చేసు కుంటూ పిల్లల్ని పోషించుకుం టున్నారు. ఇంటి స్లాబ్ పై నీటి వసతి కోసం సిమెంట్తో నీటి ట్యాంక్ను ఏర్పాటు చేసుకున్నా రు. ట్యాంక్కు మెట్లు సైతం నిర్మాణం చేశారు. ఎవరూ చూడని సమయంలో లక్కీ(5) ఇంటి స్లాబ్పై ఉన్న నీటి ట్యాంక్ ఎక్కి ప్రమాదవశాత్తు ట్యాంక్లో పడిపోయాడు. లక్కీ కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అంతటా వెతికినా ఆచూకీ దొరకలేదు. ఇంటిస్లాబ్పై ఉన్న ట్యాంక్లో చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి రోధనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి.