బోరు వేస్తుండగా పైపు తగిలి బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-06-16T04:47:33+05:30 IST
బోరు వేస్తుండగా పైపు తగిలి బాలుడి మృతి
రాయపర్తి, జూన్ 15: పల్లె ప్రకృతి వనంలో బోరు వేస్తుండగా ఇనుప పైపు తగిలి ఓ బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రహీం కథనం ప్రకారం. మొరిపిరాల శివారు శభాష్తండాకు చెందిన బదావత్ వెంకన్న, కాంతమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. వెంకన్న వ్యవసాయం చేస్తూ, కరీంనగర్లో ఎక్స్వేటర్ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. కుమారుడు బదావత్ ఈశ్వర్(12) స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనంలో బోరు వేస్తుండగా చూడడానికి ఈశ్వర్ వెళ్లాడు. ఈ తరుణంలో బోరు బావిలో నుంచి వెలికి తీసే పైపు హైడ్రాలిక్ రాడ్ ప్రమాదవశాత్తు బాలుడికి తగిలింది. దీంతో తీవ్రగాయాలైన బాలుడిన వరంగల్ ఎంజీంఎకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.