ఉయ్యాల చీర.. మెడకు బిగుసుకొని విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-03-06T06:36:15+05:30 IST

ఉయ్యాలలో ఊగుతున్న బాలుడి మెడకు అదే చీర బిగుసుకొని ఊపిరాడక మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమిల్లిలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

ఉయ్యాల చీర..  మెడకు బిగుసుకొని విద్యార్థి మృతి

మైలవరం రూరల్‌, మార్చి 5: ఉయ్యాలలో ఊగుతున్న బాలుడి మెడకు అదే చీర బిగుసుకొని ఊపిరాడక మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమిల్లిలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసుల కథనం.. మెర్సుమల్లికి చెందిన కాలేశ్వరరావుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దిరిశాల గుణదీప్‌ (11) మైలవరంలో ఓ ప్రయివేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం ఇంటి వద్ద ఉయ్యాల ఊగుతుండగా ఆ సమయంలో పక్కనే ఉన్న పశువుల దొడ్డిలో పాలు పితికేందుకు తల్లిదండ్రులు వెళ్లారు. ఈ క్రమంలో ఉయ్యాల చీర మెడకు బిగుసుకొని బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తండ్రి కాలేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

Updated Date - 2021-03-06T06:36:15+05:30 IST