నీటితొట్టిలో పడి బాలుడు మృతి
ABN , First Publish Date - 2020-12-01T06:12:59+05:30 IST
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బోరిగాం గ్రామంలో సోమవారం సాయంత్రం నీటితొట్టిలో పడి బాలుడు మృతి చెందాడు.
ముథోల్, నవంబరు 30 : నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బోరిగాం గ్రామంలో సోమవారం సాయంత్రం నీటితొట్టిలో పడి బాలుడు మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బోరిగాం గ్రామానికి చెందిన లక్ష్మీ- ఎల్లప్ప దంపతులకు మూడవ సంతానం అయిన గంగాధర్ (2)అనే బాలుడు ఇంటి ముందర ఆడుకుంటూ నీటితొట్టిలో పడ్డాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు బాలున్ని వెంటనే బయటకు తీసి భైంసా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలున్ని పరీక్షించి మృతి చెందాడని తెలిపారు.