రైఫిల్తో 10ఏళ్లలోపు పిల్లల హల్చల్.. వృద్ధుడు మృతి
ABN , First Publish Date - 2021-07-04T21:11:37+05:30 IST
ఇద్దరు పిల్లలు 62ఏళ్ల వృద్ధుడిని కాల్చి చంపిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సౌత్ కరోలినా రాష్ట్రానికి చెందిన 8ఏళ్లు, 9 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు అబ్బాయి
వాషింగ్టన్: ఇద్దరు పిల్లలు 62ఏళ్ల వృద్ధుడిని కాల్చి చంపిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సౌత్ కరోలినా రాష్ట్రానికి చెందిన 8ఏళ్లు, 9 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు అబ్బాయిలు రైఫిల్తో హల్చల్ చేశారు. 62ఏళ్ల వయసు ఉన్న డానీ ఆండ్రూ స్మిత్పై కాల్పులు జరిపారు. దీంతో ఆండ్రూ స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆండ్రూ స్మిత్ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆండ్రూ స్మిత్ మృతికి కారణమైన పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. పిల్లల చేతుల్లోకి రైఫిల్ ఎలా వచ్చింది? వారిద్దరూ ఆండ్రూ స్మిత్పై కాల్పులు ఎందుకు జరిపారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.