దేవాలయంలో చోరీ కేసులో బాలురు అరెస్టు

ABN , First Publish Date - 2021-10-17T04:53:58+05:30 IST

కడప నగరం టూటౌన్‌ పరిధిలో ఓ దేవాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు బాలురను అరెస్టు చేసి జువెనల్‌హోంకు తరలించినట్లు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు.

దేవాలయంలో చోరీ కేసులో బాలురు అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

కడప(క్రైం),అక్టోబరు 16: కడప నగరం టూటౌన్‌ పరిధిలో ఓ దేవాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు బాలురను అరెస్టు చేసి జువెనల్‌హోంకు తరలించినట్లు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిస్తూ కడపకు చెందిన ఇద్దరు బాలురు జులాయిగా తిరుగుతూ ఈజీ మని కోసం దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతూ వస్తున్నారు. ఈమేరకు శుక్రవారం ఓ దేవాలయంలో హుండీని చోరీ చేశారు. కడప అర్బన్‌ సీఐ మహ్మద్‌అలీ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాఘవేంద్రారెడ్డి, నాగతులసి అరెస్టు చేసి వారిని జువెనల్‌హోంకు తరలించిన డీఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-10-17T04:53:58+05:30 IST