బీపీ సైలెంట్‌ కిల్లర్‌: గవర్నర్‌ తమిళిసై

ABN , First Publish Date - 2021-08-02T07:27:35+05:30 IST

బీపీ (రక్తపోటు) సైలెంట్‌ కిల్లర్‌ అని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.

బీపీ సైలెంట్‌ కిల్లర్‌: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బీపీ (రక్తపోటు) సైలెంట్‌ కిల్లర్‌ అని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నిర్దిష్ట ఆహారపు అలవాట్లతో బీపీని నియంత్రించవచ్చని చెప్పారు. ఆదివారం జరిగిన ఒక వర్చువల్‌ సదస్సులో ఆమె మాట్లాడుతూ జీవనశైలి గతి తప్పితే బీపీ పెరుగుదలకు దారితీస్తుందని, ఇది కిడ్నీలు ఫెయిల్‌ అవడం, గుండెపోటు వంటి సమస్యలకు కారకమవుతుందని అన్నారు. దేశం లో 29ు ప్రజలు హై బీపీతో ఇబ్బంది పడుతుండడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హై బీపీ బారిన పడకుండా ఉండడానికి ఉప్పు వినియోగం తగ్గించాలని, శారీరక వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-08-02T07:27:35+05:30 IST