బీపీసీఎల్ లాభంలో రెండింతల వృద్ధి
ABN , First Publish Date - 2020-08-14T07:49:50+05:30 IST
జూన్ త్రైమాసికంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్).. నికర లాభం ఏకంగా రెండింతలు పెరిగి రూ.2,076.17 కోట్లుగా నమోదైంది...
న్యూఢిల్లీ: జూన్ త్రైమాసికంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్).. నికర లాభం ఏకంగా రెండింతలు పెరిగి రూ.2,076.17 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,075.10 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో రెవెన్యూ రూ.81,296.23 కోట్ల నుంచి రూ.50,616.92 కోట్లకు పడిపోయింది.