అయ్యో.. కరోనా సోకిన బ్రెజిల్ అధ్యక్షుడిని ముక్కుతో పొడిచిన పక్షి!

ABN , First Publish Date - 2020-07-16T23:32:55+05:30 IST

అయ్యో..బ్రెజిల్ అధ్యక్షుడని పొడిచిన పక్షి..ఉబుసుపోవట్లేదని మేత వేస్తే..

అయ్యో.. కరోనా సోకిన బ్రెజిల్ అధ్యక్షుడిని ముక్కుతో పొడిచిన పక్షి!

బ్రెజీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో.. ఆయన పరిస్థితి తలుచుకుంటే పాపం అనిపించకమానదు. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాను లెక్కచేయక దిలాసాగా ఉన్నందుకు ఆయన ఇటీవలే వైరస్ బారిన పడ్డారు. ఆ తరువాత క్వారంటైన్ కేంద్రానికే పరిమితమైపోయారు. అక్కడ చేసే పనేంలేక పోవడంతో బోరు కొడుతోదంటూ తెగ మారాం చేసేశారు. అదే ఊపులో అక్కడున్న పక్షులకు మేత వేయబోయి ఓ పక్షి చేత కరిపించుకున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.


ఏమాటకామాటే చెప్పుకోవాలి.. మేత వేసే సందర్బంగా ఆయన అన్ని నిబంధనలూ పాటించారట. నోటికి మాస్కు పెట్టుకున్నారట.. భౌతిక దూరం కూడా పాటించారట. అయితే పక్షి ముక్కు కాస్త పదునుగా ఉండటంతో ఆహారం దాని నోటికి అందించేటప్పుడు అధ్యక్షుడి చేతికి గాయమైందట. పక్షి చేసిన పనికి చుర్రుమనడంతో ఆయన చేయి విదిలించుకుంటడా తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 



Updated Date - 2020-07-16T23:32:55+05:30 IST