లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు!

ABN , First Publish Date - 2021-04-09T01:59:31+05:30 IST

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కీలక ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా

లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు!

న్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కీలక ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం వేలది మంది ప్రజలు కరోనా కాటుకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో జైర్ బోల్సొనారో కీలక ప్రకటన చేశారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘స్టే హోం రాజకీయాలను అంగీకరించే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా.. బోల్సొనారో ప్రకటన పట్ల సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మంగళవారం రోజు బ్రెజిల్‌లో అత్యధికంగా 4,195 మంది కరోనా కాటుకు మరణించగా.. గడిచిన 24 గంటల్లో 3700పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రెజిల్‌లో ఇప్పటి రకు మరణించిన వారి సంఖ్య 3.41లక్షలకు చేరింది. 


Updated Date - 2021-04-09T01:59:31+05:30 IST