వేతనాల కోసం బీఆర్‌సీ సిబ్బంది ధర్నా

ABN , First Publish Date - 2021-06-12T05:13:11+05:30 IST

మిషన్‌భగీరథ నిర్వహణ చేస్తున్న బీఆర్‌సీ యాజమాన్యం సిబ్బందికి వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, మహేందర్‌రెడ్డి విమర్శించారు.

వేతనాల కోసం  బీఆర్‌సీ సిబ్బంది  ధర్నా
బీఆర్‌సీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సిబ్బంది

నర్సాపూర్‌, జూన్‌ 11: మిషన్‌భగీరథ నిర్వహణ చేస్తున్న బీఆర్‌సీ యాజమాన్యం సిబ్బందికి వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, మహేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం నర్సాపూర్‌లోని బీఆర్‌సీ కార్యాలయం వద్ద సిబ్బందితో ధర్నా చేశారు. నర్సాపూర్‌ బ్రాంచి పరిధిలో 9 మండలాలకు చెందిన బీఆర్‌సీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. ధర్నాలో బాబయ్య, నర్సింహులు, స్వామి, నవీన్‌, సంతోష్‌, విష్ణు, రాజు, లక్ష్మన్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-12T05:13:11+05:30 IST