వేతనాల కోసం బీఆర్సీ సిబ్బంది ధర్నా
ABN , First Publish Date - 2021-06-12T05:13:11+05:30 IST
మిషన్భగీరథ నిర్వహణ చేస్తున్న బీఆర్సీ యాజమాన్యం సిబ్బందికి వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, మహేందర్రెడ్డి విమర్శించారు.
నర్సాపూర్, జూన్ 11: మిషన్భగీరథ నిర్వహణ చేస్తున్న బీఆర్సీ యాజమాన్యం సిబ్బందికి వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, మహేందర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం నర్సాపూర్లోని బీఆర్సీ కార్యాలయం వద్ద సిబ్బందితో ధర్నా చేశారు. నర్సాపూర్ బ్రాంచి పరిధిలో 9 మండలాలకు చెందిన బీఆర్సీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. ధర్నాలో బాబయ్య, నర్సింహులు, స్వామి, నవీన్, సంతోష్, విష్ణు, రాజు, లక్ష్మన్ పాల్గొన్నారు.